తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా రోజురోజుకి పెరుగుతుంది. తాజాగా మరో 52 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 1813 కి చేరింది. ఇక వీరిలో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1068 కి చేరగా, ఇంకా 696 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక తాజాగా ఒకరు మృతి చెందడంతో ఇప్పటివరకు కరోనాతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 49 కి చేరింది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో ౩౩ కేసులు రాగా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియచేసింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని, అంతేకాకుండా గత 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నంద్యాల ఉపఎన్నిక మొత్తం ఆటనే మార్చేసింది