Sunday, April 28, 2024

నోరు అదుపులో పెట్టుకో అంటూ వైసీపీ అభిమాని వార్నింగ్.. దానికి హైపర్ ఆది అన్సర్ వింటే షాకే

- Advertisement -

హైపర్ ఆది పెద్దగా పరిచియం అక్కర్లని పేరు ఇది. బుల్లితెర మీద మనోడు వేసే పంచ్‌లకు చాలామంది అభిమానులు ఫిదా అవుతుంటారు. తనదైన కామెడీ టైమింగ్‌తో పంచ్‌లు వేస్తుంటాడు ఆది. హైపర్ ఆది మొదట నుంచి కూడా మెగా అభిమానిగానే ఉన్నాడు. అయితే అది అవకాశాల కోసమా లేక నిజమైన అభిమానామా అనేది ఆయనకే తెలియాలి. ఇదిలా ఉంటే మొన్న జరిగిన జనసేన సభలో పవన్ కల్యాణ్ స్పీచ్ కన్నా కూడా హైపర్ ఆది మాటలే అందరిని కూడా ఆకట్టుకున్నాయి. హైపర్ ఆది స్పీచ్‌ను జనసేన కార్యకర్తలు బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే ఆయన వైసీపీ మంత్రులపై చేసిన విమర్శలను మాత్రం ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు.

హైపర్ ఆది తన పరిధిని దాటి మాట్లాడారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆడవాళ్ల మీద కుళ్లు జోకులు వేసే ఆది కూడా మంత్రుల మీద కామెంట్స్ చేయడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా అయితే హైపర్ ఆదిపై రెచ్చిపోతున్నారు. హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిన టైం వచ్చిందని.. అతని ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ చేసి అందరూ పద్ధతిగా పలకరించాలంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది .హైపర్ ఆదికి వైసిపి నాయకులు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.

వైసీపీ దెబ్బకు హైపర్ ఆది ఫోన్ స్వీచ్ ఆఫ్ అయిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓ అభిమాని చేసిన మెసేజ్‌కు మాత్రం హైపర్ ఆది ఆన్సర్ ఇచ్చారు. ఆ అభిమాని ఏమన్నారంటే… హైపర్ ఆది మీరు అంటే మాకు గౌరవం.. మిమ్మల్ని చాలా గౌరవిస్తాను.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామనే కాని.. నువ్వు దాటి మాట్లాడావు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే తీవ్ర పరిణమాలు ఉంటాయ్ అని అభిమాని హైపర్ ఆదికి మెసేజ్ చేయడం జరిగింది. దీనికి హైపర్ ఆది సమాధానం ఇస్తూ..అన్న నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. నాకు రాజకీయాల మీద ఆసక్తి కూడా లేదు. కాని పవన్ కల్యాణ్ గారు ఈ ఒక్క సంవత్సరం పార్టీ తరుఫున పని చేయమని అడిగారు..అందుకే చేస్తున్న అంతే కాని అంతకన్నా ఏమిలేదని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన స్కీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!