Saturday, April 20, 2024

మహిళలపై నిమ్మల రామానాయుడు దాడి…నువ్వు ఆడదానివా అంటూ

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ మహిళపై దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది. ఆ మహిళ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని.. విసరడానికి కూడా నిమ్మల రామానాయుడు రెడీ అవ్వడంతో అక్కడున్న వారంత కూడా ఒకింత షాక్‌కు గురైయ్యారు. అసలు నిమ్మల రామానాయుడు మహిళల ఎందుకు దౌర్జన్నానికి పాల్పడ్డారో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర పాలకొల్లులో కొనసాగుతుంది. పాలకొల్లు నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గం కావడంతో..ఆయన కాస్తా హంగు ఆర్భటాలు చేశారు. పాదయాత్ర రథానికి పూజలు చేశారు.

పూలు చల్లి స్వాగతం పలికారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ ఆయన నినాదాలు చేశారు. మూడు రాజధానుల వ్యవస్థకు మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.నిమ్మల రామానాయుడు స్వయంగా పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాలకొల్లులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు రాకపోకలకు భారీగా అంతరాయం కలిగింది. రోడ్ల మీద గంటల తరపడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయణికులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొందరు అమరావతి రైతులపై విమర్శలు కూడా చేశారు. ఓ మహిళ అడుగు ముందుకేసి పాదయాత్ర ఎందుకు చేస్తోన్నారంటూ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో నిలదీశారు. దీంతో నిమ్మల రామానాయుడుకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆ మహిళ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగారాయన.

నువ్వు ఆడదానివేనా .. అంటూ ఓ మహిళపై దూసుకెళ్లారు నిమ్మల రామానాయుడు. అక్కడితో ఆగకుండా ఆ మహిళ చేతి నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కొని..దాన్ని కింద పడేయడానికి ప్రయత్నించగా.. ఆమె ఎమ్మెల్యే చేతిని పట్టుకుని వెనక్కి లాగడం జరిగింది. ఎమ్మెల్యే అయి ఉండి మహిళపై దాడి చేయడం ఏమిటని నెటిజన్లు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. నిమ్మల రామానాయుడి వైఖరిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!