రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు ముఖ్యమంత్రులుగా పని చేశారు. వీరిలో ఒకరు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయగా, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజిత ఏపీకి రెండో ముఖ్యమంత్రిగా పని చేశారు. 1955 నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్లే విజయం సాధిస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గానికి జరిగిన మొదటి మూడు ఎన్నికల్లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ కుటుంబ సభ్యులే ఇక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు. అసలు పులివెందుల నియోజకవర్గానికి తొలి ఎన్నిక ఎప్పుడు జరిగింది, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎవరెవరు విజయం సాధించారన్న దానిపై అందిస్తున్న కథనం.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి 1955లో తొలి ఎన్నిక జరిగింది. ఈ నియోజకవర్గం పరిధిలో పులివెందుల, చక్రాయపేట, తొండూరు, లింగాల, వేముల, వేంపల్లె, సింహాద్రిపురం మండలాలు ఉన్నాయి. ఈ మండలాలు పరిధిలోని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని ఎమ్మెల్యేను ఎన్నుకుంటున్నారు. 1955లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పెంచికల బాసిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ నుంచి పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి గజ్జల మల్లారెడ్డిపై 13,917 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఆ తరువాత 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చవ్వా బాలిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పెంచికల బాసిరెడ్డిపై 5,008 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (రెక్విజనిస్ట్) నుంచి పోటీ చేసిన పెంచికల బాసిరెడ్డి మరోసారి విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నుంచి పోటీ చేసిన వీఆర్ పొన్నతోటపై 33,646 ఓట్లతో తేడా విజయం సాధించారు.
అనంతరం 1972లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పెంచికల బాసిరెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (రెక్విజనినస్ట్) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నారా అన్నరెడ్డి దేవిరెడ్డిపై 15,505 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ నేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి (ఇందిర) పోటీ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి తొలిసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి చేసిన డి నారాయణ రెడ్డిపై 20,496 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఇందిర) పార్టీ నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ మరోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 13,367 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎద్దుల బాలిరెడ్డిపై విజయాన్ని దక్కించుకున్నారు.
ఈ నియోజకవర్గంలో 1985లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఇంధిర) నుంచి పోటీ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దేవిరెడ్డి సదాశివ రెడ్డిపై 30,842 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఇంధిర) నుంచి వైఎస్ వివేకానందరెడ్డి విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జ్యోతిదేవి రెడ్డిపై 47,746 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తరువాత 1991లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఇంధిర) నుంచి పోటీ చేసిన వైఎస్ పురుషోత్తంరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన బీఆర్ అన్నారెడ్డిపై 97,448 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఇంధిర) నుంచి పోటీ చేసిన వైఎస్ వివేంకానంద రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన శిరిగిరెడ్డి రాముని రెడ్డిపై 71,580 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఇంధిర) నుంచి పోటీ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి విజయం 30,009 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన శింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డిపై విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి శింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డిపై 40,777 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 40,777 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన శింగారెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు.
అలాగే, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డి 81,373 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఇక్కడి నుంచి విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్ వెంకట సతీష్ కుమార్ రెడ్డిపై 75,243 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్ వెంకట సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపై 61,687 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. పులివెందుల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా, నాలుగు సార్లు బయటి వ్యక్తులు విజయం సాధించగా, 14 సార్లు వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తులే విజయం సాధించారు