Wednesday, April 24, 2024

చంద్రబాబు పరువు తీసిన రేవంత్ రెడ్డి .. వైఎస్ఆర్ ముందు నిలబడలేకపోయారంటూ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చీటి చిరిగినట్లుగానే కనిపిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులందరు కూడా రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు, మాణిక్యం ఠాగుర్ మీద ఫిర్యాదులు అందడంతో.. పార్టీ అధినాయకత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.మాణిక్యం ఠాగుర్‌ను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన రేవంత్ రెడ్డి .. తాను కూడా పీసీసీ పదవి వదులుకోవడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్ఆర్ గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. ఎందుకంటే ఎవరు కాదన్నా కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించింది టీడీపీ అధినేత చంద్రబాబే అని అందరికి తెలిసిన విషయం.

పైకి ఎంత చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిలో టీడీపీ రక్తమే ప్రవహిస్తుందని కొందరు అంటుంటారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ పదవి రావడం వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు వినిపించాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో.. చంద్రబాబు ఇచ్చిన సూచనతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తాజాగా ఈ ఆరోపణలన్నింటిని నిజం చేస్తూ…రేవంత్ రెడ్డి మునుగొడు బహిరంగ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ మనిషని..ఆయన అప్పుడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే,మంత్రిగా పని చేసారని రేవంత్ గుర్తు చేశారు.చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారని..తనని మాత్రం కాంగ్రెస్‌లోకి పంపారని చెబుతూ..అందులో తప్పేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇప్పుడు రేవంత్ తనను చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా చంద్రబాబు మీద ఉన్న తన గురు భక్తిని చాటుకుంటుంటారు. చంద్రబాబు మీద ఈగ వాలకుండా చూసుకుంటారాయన. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు లేకపోయినప్పటికి కూడా .. ఆయన పేరును అప్పుడప్పుడు అక్కడ ప్రస్తావిస్తుంటారు. అలాంటి రేవంత్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ఆర్‌ను ఆకాశానికి ఎత్త‌డంతో పాటు చంద్ర‌బాబు ప్ర‌చార ఆర్భాటాన్ని విమ‌ర్శించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప‌నిలో ప‌నిగా ఎల్లో మీడియా వైఎస్ఆర్‌ను ఏమీ చేయ‌లేకపోయింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు టీడీపీలోను , ఇటు కాంగ్రెస్ పార్టీలోను తీవ్ర చర్చకు దారి తీసింది. సడన్‌గా రేవంత్ రెడ్డి ఇలా వైఎస్ఆర్‌ను ఎందుకు ఆకాశానికి ఎత్తెరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!