బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేదు. అప్పటివరకు ప్రేమగా మాట్లాడుతారు. మరోసారి రెచ్చిపోతారు. ఇంకోసారి అభిమానుల చెంప చెల్లుమనిపిస్తారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను ఆప్యాయంగా పలకరించిన తన తాత గారి గ్రామస్తులను దారుణంగా అవమానించారు. వారి సామాజిక వర్గంపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. వారిపై నోరు పారేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ ఇటీవల తమ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లారు. అక్కడ తన బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. ఊర్లో ఉన్న ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేశారు. నివాళులు అర్పించారు. ఇటీవల బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు రావడంతో గ్రామస్తుల కోరిక మేరకు సందర్శించారు. బాలకృష్ణ మనస్తత్వం చిన్న పిల్లాడిలా ఉంటుందని ఆయన సన్నిహితులు. అటువంటిది నిమ్మకూరులో తనను కలిసేందుకు వచ్చిన కొమరవోలు గ్రామస్తులు పై మాత్రం నోరు పారేసుకున్నారు. ఫోటోలు కు దిగారు కదా వెళ్లిపోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆ గ్రామస్తులు నొచ్చుకున్నారు.
ఎన్టీఆర్ సతీమణి, బాలకృష్ణ తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు. బాలకృష్ణ నిమ్మకూరు వచ్చినట్లు తెలుసుకున్న కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణ వద్దకు వచ్చారు. వారి యోగక్షేమాలను బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత బాలకృష్ణతో ఫోటోలు దిగేందుకు వారంతా ఆసక్తి చూపారు. బాలకృష్ణ సైతం వారితో ఫోటోలు దిగారు. అనంతరం కొమరవోలు గ్రామస్తులు తమ గ్రామాన్ని పట్టించుకోవాలని బాలకృష్ణను కోరారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు బాలకృష్ణ. అవును పట్టించుకోను.. ఫోటోలు దిగారు ఇక వెళ్లిపోండి.. అంతేకానీ ఇదేంటిది అంటూ బాలకృష్ణ రుస రుసలాడారు.
అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు ఆవేదనకు గురయ్యారు కొమరవోలు గ్రామస్తులు. అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు అంటూ చెప్పడం వారిని బాధించింది. సాయం చేస్తే చేయాలి. లేదంటే ఊరుకోవాలి. అంతేకానీ ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటంటూ ఆ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ గ్రామస్తులు లింగాయత్తులు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా మాట్లాడారు. దీంతో బాలకృష్ణపై మరోసారి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తన అభిమానులను సైతం బాలయ్య కొట్టడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామాన్ని పట్టించుకోమని కోరినందుకు ఆ రకంగా మాట్లాడడం.. సామాజిక వర్గాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడడం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ తీరును ఎక్కువమంది తప్పు పడుతున్నారు. ప్రజల ముందుకు వెళ్లేటప్పుడు ఆలోచించుకోవాలని.. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దంటూ ఎక్కువ మంది సూచిస్తున్నారు.. మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదం అయింది.